Threat | బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు (Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వరుస బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇంతలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma)తోపాటు రాజ్పాల్ యాదవ్ (Rajpal Yadav), రెమో డిసౌజా (Remo D’Souza), సుగంధ మిశ్రా (Sugandha Mishra)కు హత్య బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తాజాగా తెలిపారు. బిష్ణు అనే పేరుతో వీరికి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, బెదిరింపు మెయిల్లో ‘మేము మీ ప్రతి కదలికను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ లేదా మిమ్మల్ని వేధించే ప్రయత్నం అయితే కానే కాదు. మీరు ఈ సందేశాన్ని సీరియస్గా తీసుకోండి’ అంటూ ఈ-మెయిల్లో పేర్కొన్నట్టు పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.
బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి తన డిమాండ్లను ఎనిమిది గంటల్లోగా నెరవేర్చకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించినట్లు తెలిసింది. అయితే ఆ వ్యక్తి డిమాండ్లు ఏంటన్నవి మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రముఖుల ఫిర్యాదు మేరకు అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఈ మెయిల్ ఐపీ అడ్రస్ పాకిస్థాన్కు చెందినదిగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ మేరకు తదుపరి విచారణ కొనసాగుతోంది.
Also Read..
Nithya Menen | సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదామనుకున్నా..! నిత్యా మేనన్ కామెంట్స్ వైరల్..!
IT Raids | మూడో రోజు.. సినీ ప్రముఖుల ఇండ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
Sai Pallavi | నాకు అలాంటి పనులు అస్సలు నచ్చవు: సాయిపల్లవి