Pradeep raj | చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో కరోనాతో పోరాడుతూ ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఆయన పరిస్థితి విషమించి జనవరి 20 సాయంత్రం మరణించాడు.
గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధ పడుతున్నాడు ప్రదీప్ రాజ్. ఇదే సమయంలో ఆయనకు కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు చెప్పారు. దాంతో చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రదీప్ రాజ్ మరణంతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రదీప్రాజ్కు కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా ఉన్న రాకింగ్ స్టార్ కేజీఎఫ్ హీరో యశ్ తో సినిమా తెరకెక్కించాడు ప్రదీప్ రాజ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన కిరాతక సినిమా మంచి విజయం సాధించడమే.. కాకుండా యష్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయనకు కరోనా రాకముందు యష్ తో కిరాతక 2 తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఆయన ఈ లోకం నుంచి వెళ్లిపోవడం అందరికీ తీరని బాధ మిగిల్చింది. ప్రదీప్ రాజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
మెగా కాంపౌండ్లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Pushpa | వాయిస్ ఆర్టిస్ట్గా పనికిరావన్నారు.. ఇప్పుడు హిందీలో ‘తగ్గేదేలే’ అంటూ ఊపేస్తున్నాడు!
రంగంలోకి దిగిన రజినీ, కస్తూరి రాజా.. ధనుష్, ఐశ్వర్య జంట మళ్లీ కలవబోతున్నారా!
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..