Dhanush and Aishwarya Divorce | రెండు రోజుల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్ అందరికీ షాకిచ్చాడు. తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 18 ఏండ్ల దాంపత్య జీవితంలో ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. విడాకులు తీసుకుంటున్నారని తెలిసి ఎవరూ నమ్మలేకపోయారు. వీరిద్దరూ కలిసిపోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని సోషల్మీడియా వేదికగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ తండ్రి కస్తూరి రాజా, మామ రజినీకాంత్ రంగంలోకి దిగారు. వారిద్దరినీ తిరిగి కలిపేందుకు తమ శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా.. ధనుష్, ఐశ్వర్య త్వరలోనే కలిసిపోతారని స్పష్టం చేశాడు.
కోలీవుడ్ మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా.. భార్యభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమని.. ధనుష్, ఐశ్వర్య మధ్య కూడా అలాంటి గొడవలే జరుగుతున్నాయని చెప్పాడు. దీనిపై డైరెక్ట్గా మాట్లాడదామని అనుకుంటే వారిద్దరూ చెన్నైలో లేరని.. హైదరాబాద్లో ఉన్నట్లు తెలిపాడు. అందుకే వాళ్లతో ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పానని అన్నారు. వారిద్దరికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చానని పేర్కొన్నాడు. రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వారిద్దరినీ కోరారని చెప్పాడు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరామని అన్నాడు. తామే కాదు చాలామంది సినీ ప్రముఖులు, సన్నిహితులు ఇదే విషయాన్ని వారికి చెప్పినట్లు తెలిపాడు మరి రజినీకాంత్, కస్తూరి రాజా మాటను గౌరవించి వాళ్లిద్దరూ కలిసిపోతారో లేదా తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..
nitish bharadwaj | ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యకు దూరమైన బుల్లితెర కృష్ణుడు..
ఇంట్లో నుంచి వెళ్లి నటి అదృశ్యం.. గోనె సంచిలో మృతదేహం లభ్యం