Thalaivi | ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు థియేటర్లలో విడుదల చేయడం ఎంత కష్టం అనేది కేవలం నిర్మాతలకు మాత్రమే తెలుసు. కొన్ని చోట్ల కేవలం 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం చేసి తమ సినిమాలను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. కొందరు నిర్మాతలైతే 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచినప్పుడు సినిమాలను రిలీజ్ చేయొచ్చులే అని వాయిదా వేసుకుంటున్నారు. కానీ మరికొందరు మాత్రం తమకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా రిలీజ్ను ఎక్కువ రోజులు వాయిదా వేయలేక ఓటీటీ సంస్థలకు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా గోపీచంద్ నటించిన సీటీమార్ థియేటర్లలో విడుదల అవుతుంటే.. నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీలో వస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు కంగనా రనౌత్ నటించిన క్రేజీ సినిమా తలైవి కూడా ఇదే వారం విడుదల అవుతుంది. అయితే ఈ సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్ అవుతుండటం విశేషం.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, అమ్మ జయలలిత బయోపిక్ తలైవి. ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ ఇందులో అమ్మ పాత్రలో నటించింది. మూడేళ్ల కింద ఈ సినిమాను ప్రకటించినప్పటికీ ఎన్నో కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్తో తలైవి సినిమాను నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 10న ఈ సినిమాను థియేటర్లతో పాటు ఒకేసారి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా విడుదల చేస్తున్నారు. హిందీ వర్షన్ను నెట్ ఫ్లిక్స్.. తెలుగు, తమిళ, మలయాళ వర్షన్లను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులు చూడొచ్చు.
ఇలా ఒకేసారి థియేటర్లలో డిజిటల్ మీడియాలో ఒక సినిమాను విడుదల చేయడం ఇదే తొలిసారి. గతంలో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన రాధే సినిమా ఇలాగే విడుదల చేయాలని అనుకున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు సల్మాన్ ఖాన్ కానీ సరిగ్గా సినిమా విడుదల సమయానికి కరోనా ఎక్కువగా ఉండటంతో దేశంలో చాలా చోట్ల థియేటర్లు మూత పడ్డాయి. దీంతో మరో ఆప్షన్ లేక కేవలం ఓటీటీలోనే సినిమాను విడుదల చేశారు. ఇక ఇప్పుడు కూడా అన్ని చోట్ల థియేటర్లు ఓపెన్ కాలేదు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే థియేటర్లతో పాటు ఒకే రోజు డిజిటల్ మీడియాలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు దాదాపు 50 కోట్లకు అమ్ముడయ్యాయని ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి.. శోభన్ బాబు పాత్రలో భీష్మ సినిమాలో విలన్ గా నటించిన బెంగాలీ నటుడు జిస్సు సేన్ గుప్తా నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg boss 5 telugu | ఈ సీజన్లో ఫస్ట్ లవ్ స్టోరీ ఎవరిదో తెలుసా..?
Bigg Boss 5 Sarayu: బిగ్బాస్ స్టేజిపై నాగ్తోనే బూతులు మాట్లాడించిన సరయు ఎలా ఫేమస్ అయింది?
Nivetha: ఆవు పాలు పితికి, కాఫీ చేసుకున్న వకీల్ సాబ్ భామ
RC 15 Poster | కేవలం పోస్టర్ కోసమే శంకర్ కోట్లు ఖర్చు పెట్టించాడా..?
Nayanthara | పెళ్లి తర్వాత నటనపై నయనతార నిర్ణయం