విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వబాధ్యతతోపాటు కథ, కథనం, మాటలు కూడా అందించారు. కందుల చంద్ర ఓబుల్రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్ నిర్మాతలు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన డా.రాజేంద్రప్రసాద్, దర్శకుడు నక్కిన త్రినాథరావు చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. ‘ఆ నలుగురు’ సినిమాలో బాలనటుడిగా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతుండటం పట్ల రాజేంద్రప్రసాద్ ఆనందం వెలిబుచ్చారు. సినిమాపై ప్రేమతో నిర్మాతగా మారానని, రామాకాంత్ అద్భుతమైన కథతో ఈ సినిమాను మలిచాడని, సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంటుందని నిర్మాత కందుల చంద్రఓబుల్రెడ్డి తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.