అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో తనకు నెగెటివ్గా నిర్ధారణ అయినట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ వైరస్పై విజయం సాధించడానికి ధైర్యమే అతిపెద్ద ఆయుధమని ఆయన తెలిపారు. ఆశావాహ దృక్పథం, తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధిని జయించవచ్చని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘కొవిడ్-19 పరీక్షలో నెగెటివ్గా ఫలితం వచ్చింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొవిడ్-19 సీరియస్గా తీసుకోవాల్సిన వ్యాధి. ఆశావాహ దృక్పథం, ధైర్యంతో ఈ మహమ్మారిని జయించవచ్చు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మాస్క్ను ధరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమికొడదాం’ అని తెలిపారు.