Sridevi Chennai Home | అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్లో స్టార్ నటిగా ఎదిగి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు భారీగా ఆస్తులను కూడా కూడబెట్టారు. ఇక చెన్నైలో శ్రీదేవికి విలువైన ఆస్తులు ఉన్న విషయం తెలిసిందే. ఆ ఆస్తుల్లో ఓ విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. నిర్మాత బోనీ కపూర్తో వివాహం అనంతరం తొలిసారి ఈ ఇంటిని శ్రీదేవి కొనుగోలు చేశారు. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఆస్తి (Sridevi Chennai Home) ఇదే కావడం విశేషం. శ్రీదేవి నటిగా తన కెరీర్లో బిజీగా ఉన్న టైంలో చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. దీంతో ఎంతో ముచ్చటపడి ఆ ఇంటిని కొనుగోలు చేశారు.
ఎంతో ఖరీదైన, ఎన్నో విశేషాలు కలిగిన ఆ ఇంట్లో ఇప్పుడు మనం నివసించే అవకాశం వచ్చింది. ఆశ్చర్యపోతున్నారా..? మీరు విన్నది నిజమే. శ్రీదేవి నివసించిన ఆ విలాసవంతమైన మాన్షన్ను ఇప్పుడు రెంట్కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ Airbnb తాజాగా వెల్లడించింది. అయితే, ఇందులో ఇద్దరు అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుంది. వారికి ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్ యాక్సెస్ లభిస్తుందని రెంటల్ సంస్థ వెల్లడించింది. ఈ ఇంటి కోసం బుకింగ్స్ మే 12వ తేదీన ప్రారంభం కానున్నట్లు సదరు సంస్థ తెలిపింది. కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే ఆప్షన్ కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని పేర్కొంది.
2018లో శ్రీదేవి మరణించిన తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ కపూర్ తీసుకున్నాడు. 2022లో జాన్వీ కపూర్ ఈ ఇంటి హోమ్ టూర్ చేసి వోగ్ ఇండియా యూట్యూబ్ ద్వారా అభిమానులకు పరిచయం చేసింది. హోమ్ టూర్ ద్వారా ఆ ఇంటి విశేషాలను పంచుకుంది. ఆ వీడియోలో ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లో ఎక్కువగా పెయింటింగ్సే కనిపించాయి. శ్రీదేవి, బోనీ కపూర్కు సంబంధించిన పలు అరుదైన ఫొటోలు, శ్రీదేవి సీక్రెట్ రూమ్, జిమ్, స్విమ్మింగ్ ఫూల్, డైనింగ్ హాల్, బెడ్రూమ్స్, కిచెన్ ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూపించింది. ఇప్పుడు ఈ ఇంట్లో సామాన్యులు కూడా నివసించే అవకాశం వచ్చింది. ఆ ఇంటిని ఈ కింది వీడియోలో చూడొచ్చు..
Also Read..
Brij Bhushan | బ్రిజ్ భూషణ్కు బీజేపీ షాక్.. కైసర్గంజ్ నుంచి ఆయన కుమారుడికి అవకాశం..!
Maneka Gandhi | మేనకా గాంధీ ఆస్తుల విలువ రూ.97 కోట్లు
Lok Sabha Elections | హాట్ ఎయిర్ బెలూన్తో ఓటింగ్పై అవగాహన.. ఎన్నికల సంఘం వినూత్న ఆలోచన