Janhvi Kapoor | ఫొటోల గురించీ, ఫొటోగ్రాఫర్ల గురించీ ఆసక్తికరంగా మాట్లాడింది అందాలభామ జాన్వీకపూర్. ఆమె తాజా సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫొటోగ్రాఫర్ల గురించి మాట్లాడింది జాన్వీ. ‘ఫొటోలు మాకు అవసరం. ఎప్పటికప్పుడు న్యూలుక్స్తో అభిమానులకు కనిపించడం మాకు ఆనందం కూడా. అందుకే ఫొటోగ్రాఫర్లకు కోపరేట్ చేస్తుంటాం. వారు కెమెరాలను క్లిక్ మనిపించగానే, మేం స్టిల్స్ ఇచ్చేస్తుంటాం. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పాతికసార్లు విమాన ప్రయాణం చేశా.
నేను ఎయిర్పోర్ట్కు రాగానే మన ఫొటోగ్రాఫర్లంతా కెమెరాలతో రెడీగా ఉంటారు. దాదాపు ఓ పదినిమిషాల పాటు కెమెరా సౌండ్స్ ఆ పరిసరాలు మోతెక్కిపోతాయి. అలాగే మాకోసం ఫొటోగ్రాఫర్లు ఎదురుచూసే మరో ప్లేస్ జిమ్. మేం జిమ్ చేసి బయటకు రాగానే ఫోటోలు తీసేస్తుంటారు. ఆ టైమ్లో ఫొటోలు తీయొద్దని ఎంత వేడుకున్నా వినరు. జిమ్ టైమ్లో బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటాం. వీళ్ల వల్ల అవి వైరల్ అవుతాయి. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వి.