హైదరాబాద్: జేమ్స్ కెమరూన్ తీసిన అవతార్- ద వే ఆఫ్ వాటర్ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆ మెగా ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల డాలర్లు(1,612 కోట్లు) ఆర్జించింది. ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ఈ విషయాన్ని తన ట్విట్టర్లో వెల్లడించారు. రెండు బిలియన్ల డాలర్లు ఆర్జిస్తేనే తదుపరి సీక్వెల్స్ గురించి ఆలోచిస్తానని ఇటీవల కెమరూన్ చెప్పిన విషయం తెలిసిందే.
జనవరి 16వ తేదీన అవతార్-2 రిలీజైంది. ఇండియాలో ఈ ఫిల్మ్ అద్భుతంగా నడుస్తోంది. అమెరికా, యూరోప్, చైనాలోనూ అవతార్-2 కలెక్షన్లు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అవతార్.. ద వే ఆఫ్ వాటర్ రెండు బిలియన్ల డాలర్ల మైలురాయిని చేరుకున్న ఆరవ చిత్రమని రమేశ్ బాలా తన ట్వీట్లో తెలిపారు.
#AvatarTheWayOfWater crosses $2 Billion at the WW Box office..
Only the 6th movie to do so..
— Ramesh Bala (@rameshlaus) January 22, 2023