రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలి సిందే. ఈ సినిమాను పాన్ ఇం డియా స్థాయిలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్, వినోదంతో మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్నది.
ఇందులో యాక్షన్ సీక్వెన్స్లు ప్రధాన ఆకర్షణ కానున్నాయని చిత్ర బృందం చెబుతున్నారు. దసరా బ్రేక్ తీసుకున్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం నుంచి తిరిగి మొదలైంది. బ్యూరోక్రాట్, రాజకీయ వ్యవస్థ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. చిత్రీ కరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా నుంచి రామ్చరణ్ ఫస్ట్ లుక్ను త్వరలో విడుదల చేస్తారని తెలుస్తున్నది. దీపావళి పర్వదినం సందర్భంగా చిత్రబృందం నుంచి ఈ అప్డేట్ రానుందట.