బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు అభిమానులే కాదు మిగిలిన నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. ఈ సినిమా విడుదలపై క్లారిటీ వస్తే.. తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఈ సినిమా విడుదలపై దర్శకధీరుడు సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు.
ఈ ఏడాది అక్టోబర్ 13న ట్రిపుల్ ఆర్ సినిమాను విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఆ రోజు విడుదల కావడం అసాధ్యమే అనిపిస్తుంది. అందుకే వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు ఆ చిత్ర నిర్మాత క్రిష్. అక్టోబర్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ లేకపోవడంతో మరికొన్ని సినిమాలను కూడా అక్టోబర్లోనే తీసుకురావాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల తేదీ మార్చినట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఆ ఒక్క మాట చెప్తే చాలా సినిమాలు అక్టోబర్ 13న రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాలకృష్ణ అఖండ, చిరంజీవి ఆచార్య, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సహా మరికొన్ని సినిమాలు అక్టోబర్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఒక్కసారి జక్కన్న నోరు తెరిచి.. తన సినమా వచ్చే ఏడాది వస్తుందని చెబితే.. మిగిలిన నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ చెప్పడానికి ఎదురుచూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో తమ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక గందరగోళంలో ఉండిపోయారు.
ఇప్పటికే RRR సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా అక్టోబర్ నాటికి సిద్ధం అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీంతో 2022 ఉగాది కానుకగా ట్రిపుల్ ఆర్ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lady villains in Tollywood |గ్లామర్తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
Boyapati Sreenu | కేజీఎఫ్ హీరోకు బోయపాటి కథ వినిపించాడా..?
స్నేహితులతో బిజినెస్ మొదలు పెట్టిన కీర్తి సురేష్
దిశా పటానీ బీచ్వాక్.. ఇన్స్టాలో కొత్త వీడియో