పాట్నా : బీహార్లోని పాట్నా జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీపు ప్రమాదవశాత్తు గంగా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.