తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కొత్త కథలకు ఎలాంటి లోటు లేదు. ముఖ్యంగా నేటి తరం దర్శకులు విభిన్నమైన కథలతో ఇండస్ట్రీకి వస్తున్నారు రొటీన్ మాస్ మసాలా కథలు రాసుకుంటే ఇక్కడ ఫ్యూచర్ ఉండదని వాళ్ళకు అర్థం అయిపోయింది. అందుకే కాస్త భిన్నంగా ఉండే కథలు రాసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక కొత్త దర్శకుడు సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా.. 20 ఏళ్ల కుర్రాడి భార్యగా 60 ఏళ్ల బామ్మ ఉంటే ఎలా ఉంటుంది అనేది కథ. వినడానికి కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలాంటి లైన్ తీసుకొని ఇప్పుడు సినిమా చేస్తున్నాడు దర్శకుడు చైతన్య కొండ.
మహేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోగుల నరేంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో పార్వతీశం హీరోగా నటిస్తున్నాడు. ఏడేళ్ల కిందట దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో పార్వతీశం కీలక పాత్రలో నటించాడు. 5 నిమిషాలు చాట్ గుంట ఫ్లాట్ అంటూ ఆ సినిమాలో సూపర్ కామెడీ చేశాడు పార్వతీశం. ఆ తరువాత మరికొన్ని సినిమాలు చేసినా కూడా ఆయనకు గుర్తింపు రాలేదు. తాజాగా సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు పార్వతీశం.
ఇందులో పార్వతీశం 60 ఏళ్ల భార్యగా సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి నటిస్తున్నారు. 20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా ఎలా..? అంటూ ఈ సినిమా ప్రమోషన్ కూడా చేస్తున్నారు..పోస్టర్ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇలాంటి కథతో ప్రేక్షకులను మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి వాళ్ల నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..