టాలీవుడ్ డైరెక్టర్ పరశురాం ( Parasuram), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu)తో తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నాడు. మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే పరశురాం అండ్ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నాడు.
మీరెన్ని పాటలు కొరియోగ్రఫీ చేశారు..?
కళావతి, పెన్నీతోపాటు మాస్ సాంగ్కు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. అప్ కమింగ్ సాంగ్ మహేశ్బాబులో ఇదివరకెన్నడూ చూడని మాస్ యాంగిల్ను చూపించబోతుంది. మహేశ్ సిగ్నేచర్ మూమెంట్స్ పాటకు మెయిన్ హైలెట్గా నిలవడం ఖాయం.
మహేశ్తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ పై..?
మహేశ్ త్వరగా నేర్చుకునే వ్యక్తి. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాలో3 పాటలు కంపోజ్ చేశారు. మహేశ్ బాడీలో అద్బుతమైన రిథమ్ కనిపిస్తుంది. మహేశ్ ఎప్పుడూ పర్ ఫెక్షన్ కోసం చూస్తుంటారు. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం. ఈ సినిమాలో కొత్త మహేశ్ను చూస్తారు. మహేశ్ డ్యాన్స్ కు 100 మార్కులు వేస్తా.
కళావతి సాంగ్ చేయడంలో మహేశ్, సితారలో ఎవరు బెస్ట్..?
ఇద్దరూ చాలా బాగా చేస్తారు. సితార అద్బుతమైన ఎనర్జీ ఉండటమే కాదు..మూమెంట్స్ లో గ్రేస్ ఉంటుంది. దురదృష్టవశాత్తు సితార సినిమాలో వచ్చే పెన్నీ సాంగ్లో కనిపించదు. ఆమె కేవలం ఆన్ లైన్ సాంగ్ వరకే పరిమితమైపోయింది.