Prasads Multiplex | ఐమాక్స్ తెరపై సినిమా చూస్తే కిక్కే వేరు. అత్యాధునిక హంగులు.. సూపర్ సౌండింగ్.. లగ్జరీ సీటింగ్తో భారీ తెరలపై సినిమా చూస్తే ఆ అనుభూతి చెప్పలేనిది. ఇలాంటి అనుభూతిని నగరవాసులకు గతంలోనే పరిచయం చేసిన ప్రసాద్స్ ఐమా క్స్.. తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకున్నది. ప్రపంచంలోనే అతి పొడవైన తెర.. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ను రూపొందించి ప్రేక్షకులకు సినీవిందును పంచనున్నది.
ఆ వివరాలను ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఐటీ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ మోహన్కుమార్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 630 సీటింగ్ కెపాసిటీతో 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో భారీ తెరను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిసెంబర్ 16న విడుదల కానున్న అవతార్ 2 సినిమా ఈ స్క్రీన్పై ప్రేక్షకులకు కనులవిందు చేయనున్నదని చెప్పారు. ఈ మేరకు స్క్రీన్కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Largest screen of the country going up. Tallest that can be made in the whole world. This is a 64ft giant and 101.6ft in width. Specially made for Prasad's by @strong_mdi
Successfully handle by me😊#PrasadsLargeScreen #PrasadsMultiplex https://t.co/vHAkzk6gZX pic.twitter.com/CaQTTi9nk7— Mohan Kumar (@ursmohan_kumar) November 21, 2022
Final pictures #PrasadaLargeScreen😊😊 https://t.co/N2qOByEskl pic.twitter.com/DHTTiJDnX4
— Mohan Kumar (@ursmohan_kumar) November 21, 2022