NBK107 Theatrical Business | నందమూరి బాలకృష్ణ వయసుతో సంబంధంలేకుండా వరుసగా యాక్షన్ సినిమాలతో మెప్పిస్తున్నాడు. ఆరు పదుల వయసు దాటిన స్టంట్లను చేస్తూ యంగ్ హీరోలకు సవాళ్ విసురుతున్నాడు. గతేడాది ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన బాలయ్య.. ప్రస్తుతం అదే జోష్తో గోపిచంద్ మలినేని చిత్రాన్ని చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటకే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
ఈ క్రమంలోనే ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందట. ఈ చిత్రానికి నైజాంలో రూ.20 కోట్లు, సీడెడ్లో రూ.14 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.35 కోట్ల వరకు డిమాండ్ ఏర్పడుతుందట. వరల్డ్ వైడ్గా ఈ చిత్రానికి దాదాపు రూ.80 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందట. ఇదే గనుక జరిగితే బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ థ్రియేట్రికల్ బిజినెస్ ఈ చిత్రానికి జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమాకు సుమారుగా రూ.70 కోట్ల వరకు మేకర్స్ బడ్జెట్ను కేటాయించారట. ఈ లెక్కన చూసుకుంటే రిలీజ్కు ముందే ఈ చిత్రం నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ను తీసుకొచ్చింది.
‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని.. బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ‘వీర సింహా రెడ్డి’, ‘రెడ్డి గారు’ అనే టైటిల్లను పరిశీలనలో ఉంచారట. టైటిల్పై అక్టోబర్ 21న క్లారిటీ రానుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.
Read Also:
Brahmastra | అప్పుడే ఓటీటీలోకి ‘బ్రహ్మాస్త్ర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sardar Movie | ‘సర్దార్’లో కార్తి అన్ని గెటప్స్ వేశాడా.. ఏకంగా సూర్యనే దాటేశాడుగా..!
Allu Sirish | అల్లు శిరీష్కు ఆ హీరో అంటే చాలా ఇష్టమట..!