బాలీవుడ్ సహా దక్షిణాది చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది హీరోయిన్ అమీ జాక్సన్ దర్శకుడు శంకర్ భారీ చిత్రాలైన ‘ఐ’, ‘2.ఓ’ సినిమాలు ఆమెకు క్రేజ్ తీసుకొచ్చాయి. బ్రిటీష్ మోడల్ అయిన అమీ ‘మదరాసీ పట్టణం’ సినిమాతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగులో రామ్చరణ్ ‘ఎవడు’ చిత్రంలో నటించింది. పలు హిందీ సినిమాల్లో కనిపించిన ఈ తార..2018 తర్వాత తెరకు దూరమైంది. పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిస్తూ వచ్చింది.
నాలుగేళ్ల విరామం తర్వాత అమీ మరోసారి తెరపై కనిపించనుంది. తన తొలి చిత్ర దర్శకుడు విజయ్ రూపొందిస్తున్న కొత్త సినిమాలో అమీ నాయికగా నటిస్తున్నది. అరుణ్ విజయ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే లండన్లో ప్రారంభమైంది. ఇక్కడ కీలక సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రిటీష్ యువతిగా కనిపించనుంది అమీ. ఆమె తొలి సినిమా ‘మదరాసీ పట్టణం’లోనూ బ్రిటీష్ యువతి పాత్రలో పరిచయం కావడం, మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్లోనూ అదే తరహా క్యారెక్టర్లో నటిస్తుండటం విశేషం.