హైదరాబాద్ : తెలంగాణ సినిమా టికెట్ల ధరల పెంపుపై టాలీవుడ్ ప్రముఖుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా హీరో విజయ్ దేవరకొండ సైతం ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు.
ఆరోగ్యకరమైన అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం సినీరంగాన్ని పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తుందని, నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నానని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ విజయ్ పేర్కొన్నారు.