కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర

లోకనాయకుడు కమల్ హాసన్ గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ షోతో పాటు సినిమాలు, రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే శభాష్ నాయుడు షూటింగ్ సమయంలో కమల్ హాసన్ యాక్సిడెంట్కు గురి కావడంతో ఆయన కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పినా.. కమల్ హాసన్ అవేమి పట్టించుకోకుండా తనపనులు చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఆ గాయం తిరగపెట్గడంతో సినిమాలు, రాజకీయాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
అందరి ప్రేమ, అభిమానం , ఆశీర్వాదం వలన తమ తండ్రి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసిందని, మరో నాలుగైదు రోజులలో తిరిగి ఇంటికి వస్తారని శృతి హాసన్, అక్షర ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నాన్నగారి ఆరోగ్యం విషయంలో శ్రీ రామ చంద్ర ఆసుపత్రి చాలా కేర్ తీసుకున్నారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటూ శృతి, అక్షర పేర్కొన్నారు. అతి త్వరలోనే నాన్నగారు మిమ్మల్ని కలుస్తారు. మీరు చూపించే ప్రేమ, అందించే ధైర్యం వలన నాన్న త్వరగా కోలుకుంటున్నారు అని లేఖలో తెలియజేశారు. కాగా, ఈ యేడాది ఏప్రిల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేసేందుకు కమల్ పార్టీకు కామన్ గుర్తు టార్చ్ లైట్ కేటాయించారు. అన్ని సెగ్మెంట్లలోనూ ఒకే గుర్తు మీద పోటీ చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్