పుడమితల్లికి హరితవర్ణకాంతుల్ని అద్దుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా సాగిపోతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమై ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో టీవీ నటి శ్రీవాణి, ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ నటుడు వెంకట్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత సమాజానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వారు ఆకాంక్షించారు.