దోహా: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సాతియాన్ జ్ఞానశేఖరన్ తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫికేషన్లో శుక్రవారం పాకిస్థాన్కు చెందిన మహమ్మద్ రమీజ్ను 4-0తో చిత్తుచేసిన సాతియాన్ టోక్యో విశ్వక్రీడలకు టికెట్ దక్కించుకున్నాడు. కాగా ర్యాంకింగ్స్ ఆధారంగా ఇప్పటికే శరత్ కమల్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. మరోవైపు మహిళల విభాగంలో మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ కూడా ఒలింపిక్స్లో చోటును పక్కా చేసుకున్నారు.