గోపీచంద్ (Gopichand ), రాశీ ఖన్నా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పక్కాకమర్షియల్ (Pakka commercial). కామెడీ ఎంటర్టైనర్గా మారుతి (maruthi) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు.
‘గోపీచంద్కు, నాకు ఏం సంబంధం ఉంటుందని మీలో చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది. గోపీచండ్ నాన్న గారు టీ కృష్ణ ఒక అద్బుతమైన దర్శకుడు. ఆయన స్టూడెంట్గా ఉన్నపుడు బీకాం ఫైనలియర్. నేను ఇంటర్మీడియట్ ఫస్టియర్. సీఎస్ఆర్ శర్మ కాలేజ్లో ఒంగోలులో చదువుకునే టైంలో..ఎవరో కొత్తగా వచ్చాడు ఈ అబ్బాయి రమ్మనండి అని టీ కృష్ణ సీనియర్ స్టూడెంట్స్ తో నన్ను పిలిపించారు. ఇక్కడ స్టూడెంట్ ఫెడరేషన్కు లీడర్గా నేను నిలబడుతున్నాను. నీ మద్దతు కావాలి. ఇక్కడ ఎలాంటి సపోర్టు కావాలన్నా మా నుంచి నీకుంటుందంటూ ఓ సోదరుడిలా ఆయన నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చా రన్నారు చిరంజీవి.’
‘అప్పట్లో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నాలో చాలా ధైర్యాన్నిచ్చింది. టీ కృష్ణగారు నాకెప్పుడూ కూడా హీరోలాగా కనిపిస్తుంటారని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లో కలవడం జరిగింది. చాలా సినిమాలు తెరకెక్కించి అత్యద్బుతమైన పేరు సంపాదించారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆయన ప్రేమ, అభిమానం గోపీచంద్ ద్వారా ఇలా కొనసాగుతుందంటూ’ చెప్పుకొచ్చాడు చిరంజీవి.
ఈ చిత్రానికి జాక్స్ బీజోయ్ సంగీతం అందిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు (Bunny Vasu) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SKN కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
Read Also : Prithviraj Sukumaran | సలార్ స్క్రిప్ట్ అద్బుతం..తెలుగులో ఇంట్రెస్టింగ్ ఆఫర్లొస్తున్నాయి : పృథ్విరాజ్