సంక్రాంతి సీజన్కు రావడానికి ఎప్పట్నుంచో కాచుకుని కూర్చుంటారు మన దర్శక నిర్మాతలు. ముఖ్యంగా యావరేజ్గా ఉన్న సినిమాలు కూడా అప్పుడు విడుదలైతే పాస్ మార్కులు వేయించుకుంటాయి. అందుకే మాస్ సినిమాలన్నీ కట్టకట్టుకుని మరీ సంక్రాంతికి వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మొన్నటి సంక్రాంతి కూడా కళకళలాడిపోయింది. కరోనా తర్వాత ఏడు నెలల విరామం తీసుకుని 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా క్రాక్, మాస్టర్ సినిమాలు కలెక్షన్స్ వర్షం కురిపించాయి. రెడ్ కూడా పర్లేదనిపించింది. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతి కూడా ఫుల్ కానుంది. అసలే 2021 అంతా కరోనాకు అంకితం ఇచ్చేశారు దర్శక నిర్మాతలు. సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో సినిమాలు ఎప్పట్నుంచి విడుదల చేయాలా అనేది ఆలోచించుకుంటున్నారు నిర్మాతలు. అయితే రిస్క్ వద్దు.. ఆగస్ట్ తర్వాతే చూసుకుందాంలే అన్నట్లు కొందరు బడా నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022 సంక్రాంతి గురించి కూడా ఇప్పట్నుంచే పోటీ మొదలైంది.
ముందు సంక్రాంతి రేసులో మహేష్ బాబు సర్కారు వారి పాట ఉండేది. అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో రేసు నుంచి సూపర్ స్టార్ తప్పుకున్నాడు. మహేష్ బాబు తప్పుకున్నా కూడా ఇప్పుడు మరో ముగ్గురు హీరోలు పండగ బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని. ఈ ముగ్గురు హీరోలతో పాటు బాలకృష్ణ కూడా సంక్రాంతికి రావాలని ఆలోచిస్తున్నాడు.
పవన్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో రానున్నాడు. ఇది ఫిక్స్ అని నిర్మాత ఏఎం రత్నం ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం సంక్రాంతి పండక్కే రానుంది. నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ సైతం సంక్రాంతికే విడుదల కానుంది. మరోవైపు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. క్రాక్ సినిమా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కావడంతో అదే సెంటిమెంట్ బాలయ్య సినిమాకు కూడా అప్లై చేస్తున్నాడు గోపిచంద్ మలినేని. ఏదేమైనా కూడా ఈ నలుగురు హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే వచ్చే కలెక్షన్స్ సునామీ మామూలుగా ఉండదేమో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
సీక్రెట్ ఏజెంట్స్గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు
రేపటి నుంచే తెలంగాణలో సినిమా థియేటర్లు ఓపెన్
తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్ సినిమా ఏంటో తెలుసా?