Katragadda Murari | ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత కాట్రగడ్డ మురారీ (78) కన్నుమూశారు. శనివారం రాత్రి చెన్నైలోని తన నీలాంగరై నివాసంలో తుది శ్వాస విడిచారు. కాట్రగడ్డ మురారీ మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. పలు సంచలనాత్మక చలన చిత్రాలను ఆయన నిర్మించారు. యువ చిత్ర బ్యానర్పై కాట్రగడ్డ మురారీ నిర్మించిన పలు సినిమాలు విజయాలు సొంతం చేసుకున్నాయి.
గోరింటాకుతోపాటు పలు తెలుగు చలనచిత్రాలకు కాట్రగడ్డ మురారీ నిర్మాతగా వ్యవహరించారు. నందమూరి బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమ మురారితోపాటు శ్రీనివాస కల్యాణం వంటి హిట్ సినిమాలకు ఆయన నిర్మాతగా పని చేశారు. కాట్రగడ్డ మురారీ మరణ వార్త తెలియగానే చిరంజీవి సహా సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాట్రగడ్డ మురారీ కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగాడ సానుభూతి తెలిపారు.