భారతదేశం తన మొదటి అంతరిక్ష నౌకను 1975 లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. ఈ శాటిలైట్ పేరు ఆర్యభట్ట. ఈ ఉపగ్రహాన్ని భారత ప్రభుత్వం సోవియట్ యూనియన్లోని కాపుస్తిన్న్ యార్ నుంచి కాస్మోస్-3ఎం అనే ఉపగ్రహ వాహక రాకెట్ సాయంతో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు.
ప్రాచీన భారత ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడూ అయిన ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని నామకరణం చేసారు. ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని జరుపుకునేందుకు, రిజర్వ్ బ్యాంక్ 1976, 1997 నాటి 2 రూపాయల నోటుపై ఈ ఉపగ్రహ చిత్రాన్ని ముద్రించింది.
ఆర్యభట్ట పూర్తిగా భారతదేశంలోనే నిర్మించబడింది. అయితే, దీన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టే సాంకేతిక విజ్ఞానం అందుబాటులో లేదు. దాంతో యూఆర్ రావు సారథ్యంలో 1972 లో సోవియట్ యూనియన్తో ఒక అంగీకారం కుదిరింది. ఉపగ్రహం ప్రయోగించినందుకు ప్రతిఫలంగా సోవియట్ యూనియన్ భారత రేవుల నుంచి లాచింగ్ వాహనాల జాడలు పట్టే ట్రాకింగ్ చేసేందుకు భారతదేశం వారికి అనుమతి ఇచ్చింది.
ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాలుగు రోజుల తర్వాత 60 ప్రదక్షణలు పూర్తి చేసుకున్న ఉపగ్రహంలో విద్యుదుత్పత్తిలో లోపం కారణంగా పనిచేయడం మానేసింది. సోవియట్ యూనియన్ మీడియా వార్తల ప్రకారం, ఈ ఉపగ్రహం అటు తరువాత కూడా కొంతకాలం వరకు పనిచేసి సమాచారాన్ని పంపినట్లు తెలుస్తున్నది. ఈ ఉపగ్రహం 1992 ఫిబ్రవరి 11 న తిరిగి భూవాతావరణంలో ప్రవేశించింది.
ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి భారతదేశం సహాయాన్ని పొందుతున్నాయి. ఇటీవలే ఇస్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డు సృష్టించింది.
2011 : క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి పదవికి ఫిడెల్ క్యాస్ట్రో రాజీనామా
2008: అణ్వాయుధాలను మోసుకెళ్ళగల 2000 కిలోమీటర్ల పొడవైన క్షిపణి షాహీన్-2 ను పరీక్షించిన పాకిస్తాన్
2007: విజార్డ్ ఆఫ్ ఐడీ సిరీస్ కార్టూనిస్ట్ బ్రాండ్ పార్కర్ కన్నుమూత
2005: రోమన్ కాథలిక్ చర్చి కొత్త పోప్గా జర్మనీకి చెందిన కార్డినల్ యోసిఫ్ రాన్సింగర్ ఎన్నిక
1977: భారతదేశపు ప్రసిద్ధ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ జననం
1972: కామన్వెల్త్ సభ్యత్వం పొందిన బంగ్లాదేశ్
1936: పాలస్తీనాలో ప్రారంభమైన యూదు వ్యతిరేక అల్లర్లు
1933: ఐఎన్సీ మాజీ అధ్యక్షుడు సయ్యద్ హసన్ ఇమామ్ మరణం
1919: మొదటిసారి పారాచూట్తో దూకిన అమెరికాకు చెందిన లెస్లీ ఇర్విన్
1882 : పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ కన్నుమూత
1864: సాంఘిక సంస్కర్త, పంజాబ్ ఆర్య సమాజ్ నాయకుడు మహాత్మా హన్స్రాజ్ జననం
1775 : అమెరికాలో జనరల్జార్జీ వాషింగ్టన్ నేతృత్వంలో స్వాతంత్య్ర ఉద్యమం ప్రారంభం
1451: ఢిల్లీని స్వాధీనం చేసుకున్న బహ్లోల్ లోడి
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..