దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
రూ.కోటీ 77 లక్షల విలువైన చెక్కుల పంపిణీ
మహబూబ్నగర్, మే 6 : నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో అత్యుత్తమ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో 177 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి సంబంధించి రూ.కోటీ 77,20,532 విలువైన చెక్కులను కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తూ ఉంటారన్నారు. సంక్షే మ పథకాల అమలులో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో పేద వర్గాలకు చెందిన ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలయ్యేవారని.. కానీ నేడు ఆడబిడ్డల పెండ్లిళ్లకు సీఎం కేసీఆర్ మేనమామగా రూ.1,00,116ల ను అందజేస్తున్నారని తెలిపారు. దీంతో పేదింటి పెళ్లి బాజాలు మోగుతున్నాయని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతి క్షణం పరితపిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్కు సన్మానం
మహబూబ్నగర్ క్లాక్టవర్, మే 6 : తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహయ్య ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ను పూలమాల, శాలువాతో గురువారం ఘ నంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నర్సింహయ్య మాట్లాడుతూ సంఘం కా ర్యాలయం కోసం 1000 గజాల స్థలం కే టాయించారని, కార్యాలయం నిర్మాణాని కి రూ.5లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. ఈ క్రమంలోనే మంత్రిని సన్మానించినట్లు చెప్పారు. కొవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చి కరోనా బాధితులకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా అందించాలన్నారు. కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు, రాష్ట్ర నాయకులు కాడెం బాలరాజ్, బాలరాజ్, లక్ష్మయ్య, ఆంజనేయులు, మాసయ్య, శివకుమార్, పెంటయ్య పాల్గొన్నారు.