Krishnam Raju Daughters | ప్రముఖ సినీ నటుడు, నిర్మాత రెబల్స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంత కాలంగా ఆనారోగ్య కారణాలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. ఈయన మృతి పట్లు పలవురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. కాగా సోమవారం సాయంత్రం కృష్ణంరాజు అంత్యక్రియలు మొయినాబాద్లోని కనకమామిడి ఫాంహౌస్లో జరుగనున్నాయి.
కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్ళు. అయితే వీళ్ళ గురించి బయట పెద్దగా ఎవరకీ తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద లండన్లో ఎమ్బీఏ పూర్తి చేసింది. కాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్తో నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక కృష్ణంరాజు రెండో అమ్మాయి ప్రకీర్తి హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతుంది. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. కాగా వీళ్ళ పెళ్ళిళ్ళు చూడకుండానే కృష్ణంరాజు మరణించడం బాధాకరం.
Read Also:
Krishnam Raju | చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఆ కోరిక ఇదే..!
కృష్ణంరాజు మృతికి కారణమిదే.. వెల్లడించిన వైద్యులు
ఇంత త్వరగా నన్ను విడిచి వెళ్లినందుకు బాధగా ఉంది: సూపర్ స్టార్ కృష్ణ