Krishnam Raju | సీనియర్ నటుడు కృష్ణంరాజుకు ప్రభాస్ అంటే ఎంతో ప్రేమ. తనకు కొడుకులు లేకపోవడంతో తమ్ముడి కొడుకైన ప్రభాస్ను తన సొంత కొడుకులా చూసుకునేవారు. ప్రభాస్తో కలిసి నటించేందుకు రెబల్ స్టార్ మక్కువ చూపేవారు. ఈ క్రమంలో ఇద్దరు వెండితెరపై బిల్లా, రెబల్, రాధేశ్యామ్ చిత్రాల్లో కలిసి యంగ్ రెబల్ స్టార్తో కలిసి కృష్ణంరాజు నటించారు. ఇప్పటి వరకు ఇద్దరు మూడు సినిమాల్లో నటించగా.. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ చిత్రమైంది. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు వారసులు లేకపోవడంతో.. ప్రభాస్ను ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్గా పేరును సాధించి.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగాడు.
కానీ, టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లో ప్రభాస్ ఒకరు. చాలా సార్లు ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వచ్చినా అవేవి నిజం కాలేదు. ప్రభాస్ ఎదుగుదలను చూసిన కృష్ణంరాజు.. పెళ్లిని మాత్రం కళ్లారా చూడలేకపోయారు. ప్రభాస్ పెళ్లి గురించి ఆయన ఆరాటపడ్డారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆశపడ్డారు. ప్రభాస్ పెళ్లి జరిగి.. పిల్లలు పుడితే వారితో నటించాలని ఎంతో ఆసక్తిగా ఉందంటూ తన మనసులో మాటను ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అలాగే.. మనవూరి పాండవులు లాంటి చిత్రంలో ప్రభాస్ నటిస్తే చూడాలని ఉందని కోరికను బయటపెట్టారు. కానీ, కృష్ణంరాజు తన కోరికలు తీరకుండా తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున 3.25 గంటల సమయంలో కన్నుమూశారు.