తెలుగు సినిమా సాహిత్య పూదోటలో పాటల సేద్యం చేసిన సాహిత్య చక్రవర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri) అందర్నీ వదిలేసి గగనసీమకు వెళ్లిపోయారు. అశ్రు నయనాల మధ్య ఈయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిసాయి. తెలుగు ఇండస్ట్రీ (Telugu Cinema) అతిరథ మహారధులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత త్వరగా ఆయన వెళ్లిపోతారు అని కలలో కూడా అనుకోలేదు అంటూ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు చేసిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసింది.
ఒక పాటల వట వృక్షం వెళ్ళిపోయింది అంటూ ఆయనను అందరూ స్మరించుకున్నారు. తన జీవితంలో ఎన్నో సాధించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. మరీ ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన వేల పాటలను ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా రాసి వెళ్లిపోయారు. అయితే ఆయన జీవితంలో ఒక కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది అంటారు సన్నిహితులు. అదే తన కొడుకు రాజాను ఒక మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో చూడడం. సిరివెన్నెల తనయుడు రాజా నటుడు అనే సంగతి చాలా మందికి తెలియదు. దాదాపు 14 సంవత్సరాల కింద తేజ తెరకెక్కించిన కేక సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు రాజా. ఆ తర్వాత ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ అన్నయ్య గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
దానికి ముందు ఎవడు సినిమాలో విలన్ గా నటించాడు. రామ్ చరణ్ వెంటే ఉంటూ మోసం చేసే స్నేహితుడి పాత్ర అది. కొన్ని మంచి సినిమాలు చేసినా కూడా రాజాకు రావాల్సిన గుర్తింపు రాలేదు. అయితే తన కొడుకు కెరీర్ విషయంలో సిరివెన్నెల మదనపడుతున్నట్లు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్లు చెప్పే మాట. ఆ ఒక్క కోరిక మినహాయిస్తే ఆయన జీవితం చాలా ప్రశాంతంగా సాగింది. రాజా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే సిరివెన్నెల ఆత్మకు అంతకంటే శాంతి చేకూరే అంశం మరొకటి ఉండదు. అది జరగాలని సిరివెన్నెల అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు