హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 140 క్యాంటీన్లతో పాటు అనంగా మరో 102 క్యాంటీన్లు ఏర్పాటు చేయనుంది. ఈ నూతన క్యాంటీన్లు మే 14వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. హరే కృష్ణా మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ రూ.5 కే భోజనం అందిస్తుంది.