బాలీవుడ్ (Bollywood) నటి కియారా అద్వానీ (Kiara Advani) ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి షేర్షా చిత్రంలో నటిస్తోంది. తమిళ చిత్ర దర్శకుడు విష్ణువర్దన్ (Vishnuvardhan) ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో డైరెక్షన్ చేసిన విష్ణువర్దన్ ఇపుడు బాలీవుడ్ లో కియారా అద్వానీతో కలిసి పని చేయడమెలా ఉందో చెప్పుకొచ్చాడు. మీరు సరైన యాక్టర్లు మీ దగ్గర ఉన్నపుడు మీరు చేస్తున్న పోరాటంలో 50 శాతం గెలిచినట్టే. మిగిలిన 50 శాతం ఆ యాక్టర్లు ఎలా నటిస్తున్నారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుందన్నాడు.
నేను కలిసిన వారిలో కియారా అద్వారీ చురుకైన, తెలివైన నటి. నేను చివరగా నయనతార (Nayanthara)ను కలిశాను. మళ్లీ చాలా కాలం తర్వాత ఇప్పుడు కియారాను కలిశాను. ఆమెతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నయనతారను కలిసినపుడు ఆమె చాలా చురుకుగా యాక్టివ్ గా ఉండేవారు. ఇపుడు కియారా విషయంలో కూడా అదే కనిపిస్తుంది. మీరు హింట్ ఇచ్చి ఏదైనా అడగండి…నయనతార, కియారా వెంటనే చెప్పేస్తారు..అంటూ నయనతార, కియారా అద్వానీకున్న దగ్గరి పోలికలేంటో చెప్పుకొచ్చాడు.
కియారా అద్వానీ మరోవైపు భూల్ భూలయ్యా 2, జుగ్ జుగ్ జీయో చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు శశాంక్ కైతాన్ డైరెక్షన్ లో ఓ చిత్రం, శంకర్-రాంచరణ్ కాంబో మూవీలో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
JokkeJokkeMeke Song | ‘జోకే జోకే మేకే’ పుష్ప సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో కేక
Meet Cute| జెట్ స్పీడ్లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?