టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). రైటర్ కమ్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడిని సినీ జనాలు మాటల మాంత్రికుడిగా అభివర్ణిస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా ఇండస్ట్రీకి మొదట రచయితగా పరిచయమైన త్రివిక్రమ్ నువ్వే నువ్వే (Nuvve Nuvve) సినిమాతో దర్శకుడిగా మారాడు.
తరుణ్, శ్రియ, ప్రకాశ్రాజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 2002 అక్టోబర్ 10న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా తరుణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్గా నిలిచిపోయింది. నువ్వే నువ్వే రేపటితో సక్సెస్ఫుల్గా 20 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిశోర్ (Sravanthi Ravi Kishore) స్పెషల్ షో ద్వారా ఈ చిత్రాన్ని అందరికీ మరోసారి చూసే అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించారు.
హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో అక్టోబర్ 10న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు షో వేయనున్నట్టు తెలిపారు. నువ్వే నువ్వే స్పెషల్ షోలో నటీనటులు, చిత్రయూనిట్ కూడా పాల్గొనబోతున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, సునీల్, ఎంఎస్ నారాయణ కీలక పాత్రల్లో నటించారు.
కోటి అందించిన ఆల్బమ్ ఆల్టైమ్ ఫేవరేట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శ్రియ, తరుణ్ మధ్య వచ్చే సీన్లు, డైలాగ్స్ తెలుగు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి.
Read Also : Ram Charan | రాంచరణ్ కొత్త లుక్ వైరల్..నెటిజన్లు ఇంప్రెస్
Read Also : Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?