తెలుగు, తమిళ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన దర్శకుడు కేవీ ఆనంద్. జీవా నటించిన రంగం.. సూర్య నటించిన బ్రదర్స్ చిత్రాలతో లాంటి సినిమాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ కేవీ ఆనంద్.. మోహన్ లాల్, సూర్య, ధనుష్, తమన్నా, విజయ్ సేతుపతి వంటి స్టార్స్తోను కలిసి పని చేశారు. ఇతని దర్శకత్వంలో వచ్చిన కో( రంగం), అయాన్( వీడొక్కడే) చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. అయితే ఈ రోజు తెల్లవారుఝామున హార్ట్ ఎటాక్తో ఆనంద్ కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు, తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
కేవీ ఆనంద్( 54) ఫొటో జర్నలిస్ట్గా తన కెరీర్ మొదలు పెట్టారు. 90లలో సినిమాటోగ్రాఫర్గా మారారు. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఆనంద్ తెన్మవిన్ కొంబత్, కాదల్ దేశం( ప్రేమ దేశం), శంకర్ ముదల్వన్( ఒకే ఒక్కడు), బాయ్స్, శివాజీ, జోష్, ఖాకీ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేశారు. అనంతరం కన్న కాందేన్ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇక అక్కడి నుండి మంచి చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఆనంద్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు.