మనం మొక్కల్ని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు దునియా విజయ్. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దునియా విజయ్ మాట్లాడుతూ ‘మొక్కల ప్రాధాన్యతను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ఎంపీ సంతోష్కుమార్ తీసుకొచ్చిన ‘వృక్షవేదం’ పుస్తకం నాకు బాగా నచ్చింది. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్కుమార్ గారికి అభినందనలు. నా ముగ్గురు స్నేహితులతో కూడా మొక్కలు నాటిస్తాను’ అన్నారు.