Dil Raju | ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ (Sandhya theatre stampede) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయాలైన శ్రీతేజ్ (Sreetej) కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే శ్రీతేజ్ను ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు పరామర్శించారు. తాజాగా దిల్ రాజు ఇవాళ నిర్మాత అల్లు అరవింద్తో కలిసి మరోసారి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు.
శ్రీతేజ్ను పరామర్శించిన అనంతరం అతని తండ్రి భాస్కర్తో చర్చించనున్నారు. శ్రీతేజ్ తండ్రికి దిల్ రాజు, అల్లు అరవింద్ ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం..
దిల్ రాజు మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలన్నారు. సీఎం రేవంత్ అపాయింట్ మెంట్ కోరాం. రేపు లేదంటే ఎల్లుండి సీఎం రేవంత్రెడ్డి కలుస్తాం. అల్లు అర్జున్ను కూడా కలుస్తామన్నారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేస్తా. రేవతి కుటుంబం వినోదం కోసం థియేటర్కు వెళ్లారు. కావాలని ఎవరైనా ఇలా చేస్తారా..? అన్నారు దిల్ రాజు.
రేవతి భర్త భాస్కర్కు సినీ ఇండస్ట్రీలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్డీసీ ఛైర్మన్గా బాధ్యత తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాన్ని కాపాడుకోవడమే అందరి లక్ష్యమన్నారు దిల్ రాజు.
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ
Bollywood 2024 | బాలీవుడ్కు కలిసి వచ్చిన 2024.. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్ హిందీ సినిమాలివే..!