Dhruva Natchathiram | చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విక్రమ్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం.. చాప్టర్ వన్: యుద్ద కాండం (Dhruva Natchathiram). లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ధ్రువ నక్షత్రం నుంచి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్.
ఈ సినిమా ట్రైలర్ దసరా కానుకగా థియేటర్లలో విడుదల అయినట్లు దర్శకుడు గౌతమ్ వాసు దేవ్ మీనన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అక్టోబర్ 24న విడుదల చేయనున్నట్లు తెలిపాడు. ధ్రువ నక్షత్రంలో ఐశ్వర్యా రాజేశ్, సిమ్రాన్, రాధికాతోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
The Trailer of #DhruvaNatchathiram is playing exclusively at theatres near you! And releasing online on 24th October.@chiyaan @Jharrisjayaraj @OndragaEnt @oruoorileoru pic.twitter.com/bFNqFWlDnl
— Gauthamvasudevmenon (@menongautham) October 21, 2023
ధ్రువ నక్షత్రం మూవీకి యువ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ధ్రువ నక్షత్రంలో రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విక్రమ్ నటిస్తున్న మరో సినిమా తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.