సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో ధనుష్-సాయిపల్లవి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి ‘మారి’ సీక్వెల్లో నటించారు. ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయినా.. ఆ పాటను మాత్రం యూత్ బాగా ఇష్టపడ్డారు. తాజాగా ధనుష్-సాయిపల్లవి కలయికలో మరో సినిమా రాబోతున్నది. ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించబోతున్నారు.
‘ధనుష్ 55’ వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ సినిమా త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది. ఇద్దరు కథానాయికలకు చోటున్న ఈ సినిమాలో ఇటీవలే శ్రీలీలను ఓ నాయికగా ఖరారు చేశారు. తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి సాయిపల్లవి ఎంటరైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఫొటోను విడుదల చేసింది. ‘అమరన్’ తరహాలోనే దేశభక్తి ప్రధానంగా సాగే కథాంశమిదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గూఢచారి ఇతివృత్తంతో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సాయిపల్లవి హిందీలో ‘రామాయణ’ ‘ఏక్దిన్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.