2010లో వచ్చిన ప్రస్థానం సినిమాతో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ దేవాకట్టా (Deva Katta). ఆ తర్వాత ఇదే చిత్రాన్ని 2019లో హిందీలో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. సినిమాలు తీసే విషయంలో భిన్నమైన శైలితో ముందుకు సాగే ఈ డైరెక్టర్ సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో కలిసి రిపబ్లిక్ (Republic) సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది రిపబ్లిక్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు దేవా కట్టా.
తాను 6-7 కథలు సిద్దం చేశానని, వాటిలో రెండు చాలా చాలా ఆసక్తికరంగా ఉంటాయని దేవా కట్టా చెప్పాడు. ఆ రెండు కథలను ప్రేక్షకులకు చూపించకముందే చనిపోతామోనని భయమేస్తుందన్న దేవా కట్టా..ఖచ్చితంగా ఆ రెండు సినిమాలను తీయకుండా చనిపోవాలనుకోవడం లేదని అన్నాడు. ‘అన్నీ కొత్త పాయింట్స్ తో నేను కథలు రాశా. రిపబ్లిక్ విడుదలైన తర్వాత మూడు నెలల్లోపు కొత్త సినిమా మొదలుపెడతా. ఓటీటీలో పోరాటం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుందని నాకు తెలుసు. వచ్చే ఐదేళ్లు నాన్ స్టాప్ గా సినిమాలు తీయాలనుకుంటున్నా. రెండు బలమైన కథలున్నాయి. ఈ రెండు కథలు జనాలకు చెప్పకపోతే నా జీవితానికి అర్థమే లేదు. ఈ కథలు పూర్తయిన తర్వాత ఓటీటీ కోసం పనిచేయడంపై ఆలోచిస్తానని’ చెప్పుకొచ్చారు.
ఓ టీనేజీ ప్రేమకథ రాసినట్టు చెప్పాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. 17 ఏళ్ల బాలిక ప్రయాణం మొదలై 45 ఏళ్ల వయస్సున్న తల్లిగా ఎలా ముగుస్తుందో..ఆమె ప్రయాణం నేపథ్యంలో మరో కథను సిద్దం చేశాను. ముంబై మాఫియా నేపథ్యంలో ఇంకో కథను రాశాను. ఈ కథలను ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని తెలిపాడు దేవా కట్టా. మొత్తానికి రాబోయే కాలంలో ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నుంచి మంచి సినిమాలు రావడం ఖాయమైనట్టే.
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని