Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకున్న తర్వాత దీపిక జోరు బాలీవుడ్లో కాస్త తగ్గిందనే చెప్పాలి. తన పెళ్లి అయినప్పటి నుంచి తను ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. అడపా దడపా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. తాజాగా 83 అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో రణ్వీర్ సరసన నటించింది. ఈ సినిమా శుక్రవారమే రిలీజ్ అయింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది ఈ సుందరి.
ముఖ్యంగా తనకు కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కరోనా సోకడం గురించి ఇంటర్వ్యూలో చెప్పి భావోద్వేగానికి గురయింది. సెకండ్ వేవ్ సమయంలో తనకు మాత్రమే కాదు.. తన ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. దీంతో తను చాలా డల్ అయిపోయింది. అది చాలా క్లిష్టమైన పరిస్థితి అని.. కరోనా ట్రీట్మెంట్ తీసుకునే సమయం తనకు ఒక నరకంలా అనిపించిందని చెప్పింది.
కరోనా మహమ్మారి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఎన్నో సమస్యల్లోకి నెట్టేసింది. నేను కూడా కోవిడ్ బాధితురాలినే. ఫిజికల్గా కూడా నేను చాలా మారిపోయా. కోవిడ్ వల్ల నా మైండ్ పనిచేయలేదు. దీంతో కరోనా తగ్గాక కూడా 2 నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నా జీవితంలో సెకండ్ వేవ్ కోవిడ్ నాకు ఎన్నో పరీక్షలు పెట్టింది. దాని వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను.. అంటూ దీపిక భావోద్వేగానికి గురయింది.
కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇద్దరూ ముంబైలోనే ఉన్నారు. కానీ.. సెకండ్ వేవ్ సమయంలో మాత్రం బెంగళూరులో ఉన్న తన పేరెంట్స్ దగ్గరికి తన భర్తతో సహా వెళ్లింది దీపిక. ఇద్దరూ కరోనా సెకండ్ వేవ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. అక్కడే దీపిక కూడా కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సినిమా టికెట్ ధరల పెంపు.. సీఎం కేసీఆర్కు చిరంజీవి కృతజ్ఞతలు
మరో వివాదంలో సన్నీ లియోన్.. క్షమాపణ చెప్పాలంటున్న బ్రాహ్మణులు