హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ ధరలు సవరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. సినిమా టికెట్ల ధరల పెంపుతో థియేటర్ల మనుగడతో పాటు వేలాది మంది కార్మికులకు మేలు జరుగుతుందని చిరంజీవి పేర్కొన్నారు. న్యాయం జరిగేలా కేసీఆర్ టికెట్ ధరలు సవరించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నిర్మాతలు, పంపిణీదారులతో పాటు థియేటర్ యాజమాన్యాలకు న్యాయం జరిగిందన్నారు. సినీ పరిశ్రమ కోరికను మన్నించిన కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.