హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ ధరలు సవరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. సినిమా టికెట్ల ధరల పెంపుతో థియేటర్ల మనుగడతో పాటు వేలాది మంది కార్మికులకు మేలు జరుగుతుందని చిరంజీవి పేర్కొన్నారు. న్యాయం జరిగేలా కేసీఆర్ టికెట్ ధరలు సవరించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నిర్మాతలు, పంపిణీదారులతో పాటు థియేటర్ యాజమాన్యాలకు న్యాయం జరిగిందన్నారు. సినీ పరిశ్రమ కోరికను మన్నించిన కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.
తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021