ముంబై: వై ఐ కిల్డ్ గాంధీ సినిమాను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంతో పాటు ఓటీటీ ఫార్మాట్లో ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డకోవాలని ఆ పార్టీలో ఓ లేఖలో కోరింది. సినిమాలో నాథూరామ్ గాడ్సే పాత్రను ఎన్సీపీ నేత పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయబోనివ్వమని కాంగ్రెస్ నేత నానా పటోల్ తెలిపారు. జనవరి 30వ తేదీన ఓటీటీ ఫార్మాట్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి రోజున సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో మాజీ శివసేన నేత, ఎన్సీపీ ఎంపీ అమోల్ ఖోలే.. నాథూరామ్ గాడ్సే పాత్రను పోషించారు. వై ఐ కిల్డ్ గాంధీ చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి లేఖ రాసింది.