టాలీవుడ్ (Tollywood) యాక్టర్ బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్ఫాం (Aha OTT) ‘ఆహా’ లో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable) షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ లుక్కు మంచి స్పందన వస్తోంది. కాగా (Aha talk show) తాజా టాక్ షోకు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా రాబోతున్నారు.
మంచు మోహన్ బాబు కుటుంబం (Manchu family) తొలి ఎపిసోడ్లో కనిపించబోతున్నారని ఇప్పటివరకున్న సమాచారం. కాగా ఈ షోకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi), బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారట. అంతేకాదు వీరితోపాటు రాంచరణ్ (Ramcharan) కూడా కనిపించనున్నట్టు టాక్. చిరు-చరణ్ ఎపిసోడ్కు సంబంధించిన చర్చలను అల్లు అరవింద్ ఇప్పటికే జరుపుతున్నట్టు తెలుస్తోంది.
తండ్రీకొడుకులిద్దరూ కలిసి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందు బాలకృష్ణ టాక్ షోకు హాజరైతే…ప్రచార కార్యక్రమం కూడా చేసినట్టు అవుతుంది. మొత్తానికి బాలకృష్ణ టాక్ షోలో చిరు-చరణ్ తో సరదాగా ముచ్చటించే విషయాలపై ఇప్పటినుంచే తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు.
ఇవి కూడా చదవండి..
Esha Gupta: పైన మొత్తం విప్పేసి ఇలా రచ్చ చేస్తుందేంటి?