టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య విడుదలకు రెడీ అయింది. మరోవైపు వేదాళమ్ రీమేక్ భోళా శంకర్, లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉన్నాయి. వీటితోపాటు బాబీ దర్శకత్వంలో 154 (Chiranjeevi 154)వ ప్రాజెక్టును కూడా చేయబోతున్నాడు చిరు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా చిరు టీం హీరోయిన్ ఎవరనేది ప్రకటించింది. కోలీవుడ్ స్టార్ హీరో శృతిహాసన్ (Shruti Haasan)ను ఫీ మేల్ లీడ్ రోల్కు ఎంపిక చేసినట్టు చిరంజీవి తెలియజేశాడు. ఈ మేరకు చిరంజీవి ఓ ట్వీట్ చేశాడు.
మా టీంలోకి శృతిహాసన్కు స్వాగతం అంటూ బొకేను అందిస్తున్న ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు చిరు. శృతిహాసన్-చిరంజీవి కాంబినేషన్ తొలిసారి కావడంతో మూవీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్ ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించబోతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్గా కమర్షియల్ హంగుల మేళవింపుతో రాబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆర్ధర్ ఏ విల్సన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు.
On this Women's Day, delighted to Welcome you on board @shrutihaasan
You bring Woman Power to #Mega154 @MythriOfficial @dirbobby #GKMohan @ThisIsDSP pic.twitter.com/xYMaiQPpni— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2022
క్రాక్ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న శృతిహాసన్ ఆ తర్వాత గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దీంతోపాటు పాన్ ఇండియా ప్రాజెక్టు సలార్లో ప్రభాస్తో కలిసి రొమాన్స్ చేయనుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.