ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (Agent Sai Srinivasa Athreya) మూవీతో అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే (Swaroop RSJ ). ఈ యువ దర్శకుడు తాజాగా మిషన్ ఇంపాజిబల్ (Mishan Impossible)తో ఎంటర్ టైన్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఏప్రిల్ 1న గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్లాన్ చేశారు. తాప్సీ (Taapsee Pannu) పన్ను మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో బాలనటులు హర్ష్ రోషన్, భాను ప్రక్షన్, జయతీర్థ మొలుగు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను పట్టుకునే క్రమంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయనేది ఫన్నీగా చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
HERE'S THE s̶m̶a̶l̶l̶ BIG NEWS🔥
MEGA STAR @KChiruTweets Garu is the Chief Guest of #MishanImpossible Mega Pre Release Event🌟
⏰ Tomorrow from 6PM@taapsee @swarooprsj @MatineeEnt #NiranjanReddy #AnveshReddy @pasha_always @iamMarkKRobin @saregamasouth#MishanImpossibleOnApril1 pic.twitter.com/jqFdZc9efF
— BA Raju's Team (@baraju_SuperHit) March 29, 2022
ఈ చిత్రంలో కలర్ ఫొటో ఫేం డైరెక్టర్ సందీప్ రాజ్, హీరో సుహాస్ కీలక పాత్రల్లో నటించడం విశేషం. మిషన్ ఇంపాజిబుల్ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.