సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికపుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుంటాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ను, ఫ్యామిలీ లైఫ్ను బ్యాలెన్స్ చేయడంలో చిరు స్టైలే వేరని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్స్, ఇతర కమిట్మెంట్స్ నుంచి ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతుంటాడు.
అయితే చిరంజీవి ఈ సారి ఓ వైపు ఫ్యామిలీ, మరోవైపు హీరోయిన్ శృతిహాసన్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ చేసిన ట్వీట్ ఇపుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఫ్యామిలీ తో అటు విహార యాత్ర..హీరోయిన్తో ఇటు వీరయ్య యాత్ర.. అని ట్వీట్ చేశాడు. చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు.
చిరంజీవి షూటింగ్లో భాగంగా యూరప్కు వెళ్లినట్టు తాజా పోస్ట్తో తెలుస్తోంది. షూటింగ్ బ్రేక్ టైంలో చిరంజీవి సరదాగా ఇలా ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లాడంటూ చర్చించుకుంటున్నారు ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రానికి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు.
మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఫ్యామిలీ తో అటు విహార యాత్ర
హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022
Read Also : Sivaji The Boss | తలైవా అభిమానులకు డబుల్ బొనాంజా.. మరో సినిమా రీరిలీజ్
Read Also : Satyadev | చిరంజీవి క్లాసిక్ రీమేక్లో నటించాలని ఉంది: సత్యదేవ్
Read Also : Tillu 2 | టిల్లు 2 హీరోయిన్గా మరో భామ పేరు.. ఈ సారైనా ఒకే అయ్యేనా..?
Vishnu Vishal | గుత్తా జ్వాల కష్టకాలంలో నా లైఫ్లోకి వచ్చింది: విష్ణువిశాల్