chennakesava reddy | తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ సెట్ చేసిన హీరో నందమూరి బాలకృష్ణ. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఆయన చేసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాయి. బాలయ్య చేశాడనీ మోజుపడి మరి ఇంద్ర అంటూ చిరంజీవి కూడా ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా చేశాడు. ఇది కూడా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. అయితే ఫ్యాక్షన్ సినిమాలు అన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అవుతాయి అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు మిస్ ఫైర్ కూడా అవుతుంటాయి. అలా అంచనాలు అందుకోలేకపోయిన సినిమా చెన్నకేశవరెడ్డి.
2002 సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదలైంది. వి.వి.వినాయక్ తెరకెక్కించిన చెన్నకేశవరెడ్డి ఆకాశమంత అంచనాలతో విడుదలైంది. దానికి తోడు ఆది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు వినాయక్. ఆ సమయంలో బాలకృష్ణతో డబుల్ రోల్ చేయిస్తూ ఈయన చేసిన సినిమా చెన్నకేశవరెడ్డి. కథ ఇంచుమించు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మాదిరే ఉంటుంది. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చలేదు. స్క్రీన్ ప్లే లోపాలతో సూపర్ హిట్ కావలసిన చెన్నకేశవరెడ్డి యావరేజ్ దగ్గర ఆగిపోయింది. అయినా కూడా ఈ సినిమా చాలా మంది అభిమానులకు ఫేవరెట్. పైగా దర్శకుడు వినాయక్ కూడా తన కెరీర్లో ఇప్పటి వరకు బెస్ట్ యాక్షన్ వర్క్ చెన్నకేశవరెడ్డి కోసమే చేశాను అని చెప్తాడు. భూమిలో నుంచి సుమోలు బయటకు వచ్చే సీన్స్ న భూతో న భవిష్యత్.. నన్ను పట్టుకోవాలంటే కావాల్సింది ఖాకీ కాదు ఖలేజా అంటూ బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగులు మాస్ జనాలకు విపరీతంగా నచ్చాయి. అప్పటి వరకు తెలుగు సినిమాలో చూడనటువంటి యాక్షన్ సన్నివేశాలు అవి. చెన్నకేశవరెడ్డి సినిమాలో అలాంటి యాక్షన్ సీన్స్ ఇంకొన్ని కూడా ఉన్నాయి. అయితే ముందు చెప్పుకున్నట్లుగా కొన్ని స్క్రీన్ ప్లే లోపాలు ఈ సినిమాకు విజయాన్ని దూరం చేశాయి. సెప్టెంబర్ 25తో 19 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది చెన్నకేశవ రెడ్డి సినిమా.
ఈ సందర్భంగా బాలయ్య అభిమానుల కోసం హైదరాబాద్ దేవి థియేటర్ లో సెప్టెంబర్ 25 రాత్రి ఒక స్పెషల్ షో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి బాలకృష్ణ కూడా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సినిమాకు పనిచేసిన యూనిట్ కూడా ఈ స్పెషల్ షోకు వస్తారని తెలుస్తోంది. బాలయ్య అభిమానుల నుంచి కూడా చెన్నకేశవరెడ్డి స్పెషల్ షో కు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమాలో టబు, శ్రియ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ అందించిన సంగీతం సూపర్ డూపర్ హిట్ అయింది. మొత్తానికి మరి 19 సంవత్సరాల తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తే అభిమానులు ఎంతగా ఎంజాయ్ చేస్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పూజా హెగ్డే తీరుతో ప్రభాస్ నిర్మాతలు విసిగిపోతున్నారా..!
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన చిరంజీవి
కాజల్ మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్
ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?
Lobo: ప్రియాంకతో అసభ్యంగా ప్రవర్తించిన లోబో.. తోటి వారితో చెప్పుకొని బాధపడ్డ ట్రాన్స్ జెండర్