కరోనా వలన డిజిటల్ రంగం క్రమక్రమేపి అభివృద్ధి చెందుతుంది. థియేటర్స్లో విడుదల కావలసిన సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరోవైపు థియేటర్లో పెద్దగా అలరించలేకపోయిన సినిమాలు ఓటీటీలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నాయి. తాజాగా నితిన్ నటించిన చెక్ చిత్రం కూడా ఓటీటీలో విడుదలకు సిద్దంగా ఉంది. మే 14 నుండి సన్నెక్ట్స్లో స్ట్రీమింగ్ కానున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చెక్ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపించారు. నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో దేశద్రోహం కేసులో అరెస్ట్ అయి సెంట్రల్ జైలుకి వెళతారు. అక్కడ జరిగే పరిణామాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.