2002లో వచ్చిన నీతోడు కావాలి సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మెరిసింది ముంబై భామ ఛార్మీకౌర్ (Charmy Kaur). ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతోపాటు పలు చిత్రాల్లో నటించి లీడింగ్ హీరోయిన్గా కొనసాగింది. 2015లో లీడ్ రోల్లో వచ్చిన జ్యోతిలక్ష్మి (Jyothi Lakshmi) చిత్రంతో చివరి సారిగా హీరోయిన్గా మెరిసింది ఛార్మీ. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా బిజీ అయిపోయింది.
ప్రస్తుతం పూరీజగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లైగర్ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది ఛార్మీ. ఈ భామ మళ్లీ మేకప్ వేసుకుంటుందా..? లేదంటే నిర్మాతగానే సెటిల్ అవుతుందా..? అంటూ కొన్నాళ్లుగా చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు. అయితే వారికి ఓ క్లారిటీ ఇచ్చింది ఛార్మీ.
ఇటీవల వరంగల్లో జరిగిన రొమాంటిక్ (Romantic) ప్రీ రిలీజ్ వేడుకలో ఛార్మీ మాట్లాడుతూ..నేను నిర్మాతగా చాలా బిజీగా ఉన్నా. ఒక సమయంలో నేను నటిననే విషయాన్నే మరిచిపోయాను. కానీ ఇండస్ట్రీ నన్నిప్పటికీ గుర్తు పెట్టుకుంది. నాకు ఇప్పటికీ యాక్టింగ్ ఆఫర్లు వస్తున్నాయి. కానీ మళ్లీ నటించాలన్న ఆసక్తి నాలో లేదు. భవిష్యత్లో నేను మళ్లీ నటిస్తానని అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఛార్మీ. ఈ మాటలతో ఛార్మీ ఇక నిర్మాతగానే కొనసాగనుందని చెప్పకనే చెప్పిట్టు స్పష్టమవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rakul Preet Singh | రకుల్ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో దుబాయ్కు రవితేజ..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత