టాలీవుడ్లో మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న తాజా చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). నిఖిల్(Nikhil Siddharth) హీరోగా నటించగా..అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో వస్తున్న ఈ ప్రాజెక్టు ఆగస్టు 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
కాగా మేకర్స్ తాజాగా కొత్త అప్డేట్ అందించారు. కార్తికేయ 2 సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రయూనిట్ హార్డ్వర్క్, డెడికేషన్పై ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ఖేర్, ఆదిత్యా మీనన్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కార్తికేయ 2కు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్ కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: చందు మొండేటి. ఇప్పటికే కార్తికేయ 2 టీం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా యూపీలోని ప్రపంచ ప్రఖ్యాత ISKCON ఆర్గనైజేషన్ను సందర్శించిన విషయం తెలిసిందే.