Dhanush | నటుడు ధనుష్ (Dhanush), ఐశ్వర్య (Aishwarya Rajinikanth)లకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ నటించిన ‘వేలైయిల్లా పట్టదారి’ (Velaiyilla Pattadhari) (తెలుగులో రఘువరన్ బీటెక్) సినిమాలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, క్రమబద్ధీకరణ చట్ట ఉల్లంఘనలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది.
2014లో రిలీజైన ఆ చిత్రంలో ధనుష్ సిగరెట్ తాగే సన్నివేశాల్లో స్క్రీన్పై హెచ్చరికలు సరిగా కనిపించలేదని, కాబట్టి నటుడు ధనుష్, నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ పొగాకు నియంత్రణ సంస్థ తరపున తమిళనాడు ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్, సైదాపేట కోర్టులో ఐశ్వర్య, ధనుష్లపై కేసు దాఖలు చేశారు.ఈ కేసు సైదాపేట కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసును రద్దు చేయాలని ధనుష్, ఐశ్వర్య తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు కొట్టేయాలంటూ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి ఆనంద వెంకటేశ్ కేసును కొట్టేస్తూ సోమవారం తీర్పు వెలువరించారు.
Also Read..
School Bus | ఎస్యూవీ కారును ఢీ కొన్న పాఠశాల బస్సు.. ఆరుగురి మృతి
Heavy Rains | ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Madhya Pradesh | బాధితుడు ఒకరైతే.. మరొకరి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం.. కావాలనే డ్రామా ఆడారా?